రోజు మనం రకరకాల కూరగాయలు పళ్ళు తింటూ ఉంటాం. అయితే ఏ ఆహారపదార్ధాలు మనకు ఏ విధం గా మేలు చేస్తాయో మనలో అందరికీ కాకపోయినా కొంతమంది కి తెలియదు. మనం తినే కొన్ని ఆహారపదార్థాలు మనకు ఏ రకంగా ఉపయోగపడతాయో తెలుసుకుందామా...
కీరదోస:
కీర దోస లో ఉండే సిలికాన్, సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. అలాగే కంటి క్రింది నల్లని వలయాలను అరికట్టడం లో ఉపయోగ పడతాయి.
అల్లం:
అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. అయితే ఎక్కిళ్ళు తగ్గినప్పుడు అల్లం తినడం వల్ల తగ్గుతాయట. అలాగే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. అంతే కాదు మలబద్దకం కూడా వదిలిస్తుంది.
ఉలవలు:
ఉలవలు ఊబకాయాన్ని తగ్గించడం లో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
మామిడి పళ్ళు:
మామిడి పండు కి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉందట.
జామకాయ:
జామపళ్ళు ఎక్కువ గా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వాము:
వాము తినడం వల్ల దంత వ్యాధులు తగ్గుతాయి.
నేరేడు పళ్ళు:
నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
టొమాటాలు:
ప్రోస్టేట్ కాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటాలకు ఉంది