తెల్లగా
ప్రకాశవంతమైన చర్మం చాలా ఆకర్షనీయం
గా ఉంటుంది. తెల్లని చర్మం కోసం చాలా
మంది చాలా పద్ధతులను అనుసరిస్తూ
ఉంటారు. కాని ఇంట్లో తయారు
చేసిన పేస్ పాక్స్ వాడడం
వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా
ఉంటాయి. అలాగే ఖర్చు తక్కువ.
ఎక్కువగా పాలు, తేనే, పెరుగు
మరియు పండ్ల రసాలతో పాక్స్
వేయడం వల్ల చర్మానికి ఎటువంటి
హాని కలుగదు. ఇవి చర్మానికి చాల
మంచిది.
కుంకుమపువ్వు-
పాలు
కుంకుమపువ్వు
మరియు పాలతో చేసిన ప్యాక్
వాడటం వలన మీ చర్మం
కాంతివంతంగా మారుతుంది. ఇది ఎక్కువగా డ్రై
స్కిన్ కలిగిన వారికి ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ మొటిమలను
తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహకరిస్తుంది. పచ్చిపాలు మీ చర్మాన్ని శుభ్ర
పరచి ప్రకాశవంతంగా చేస్తాయి.
విధానం
:
పచ్చి
పాలల్లో ఒక స్పూన్ కుంకుమపువ్వుని
కలిపి 2 నిమిషముల పాటు ముఖాన్ని చేతులతో
వలయాకారం లో మద్దన చేయాలి.15
నిమిషముల తరువాత నీటితో శుభ్రం గా కడగాలి.
పెరుగు-వోట్స్
సన్ టాన్ మచ్చలను తొలగించడం
లో పెరుగు మరియు వోట్స్ ప్యాక్
అద్భుతం గా పని చేస్తుంది.
వోట్స్ చర్మంలోని మృత కణాలను తొలగించి,
మొటిమలను చర్మంలో నుంచి బయటకు రాకుండా
చేస్తుంది.
విధానం:
వోట్స్
మరియు పెరుగు ను కలిపి పేస్టు
మాదిరిగా తయారు చేసి ముఖానికి
అప్లై చేసి 20 నిమిషముల తరువాత చేతులతో మద్దన చేస్తూ చల్లని
నీటితో కడగాలి.
నారింజ
తొక్క-గంధపు చెక్క
నారింజలో
ఎక్కువగా కాల్షియమ్ ఇంకా విటమిన్ C ఉండటం
వలన చర్మం మీద మచ్చలను
మరియు దెబ్బలను నయం చేస్తుంది. ఈ
రెండిటిని కలిపి వాడటం వలన
చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
అంతే కాకుండా ఇది మీ చర్మాన్ని
మరింత కాంతివంతంగా చేస్తుంది.
విధానం:
ఒక స్పూన్ గంధపు పొడి మరియు
నారింజతొక్క పొడి తీసుకొని తగినంత
నీరు పోసి కలిపి పేస్టు
చేయండి. 5 నిమిషముల పాటు పేస్టుతో ముఖానికి
మసాజ్ చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడిగేయాలి.
స్ట్రాబెర్రి-తేనే
ఈ ప్యాక్
వాడటం వలన మీ చర్మం
మరింత కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ ఏ
వయస్సులో ఉన్న వారికైనా మంచి
ఫలితాన్ని ఇస్తుంది.
విధానం:
రెండు
స్ట్రాబెర్రి పండ్లను తీసుకొని పేస్టుగా చేసి
పాలు మరియు తేనే కలిపి
ముఖానికి ప్యాక్ వేసుకొని 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి.
నిమ్మరసం-తేనే-పాలపొడి
ఈ ప్యాక్ ని వాడటం వలన
మీ చర్మం మీద మచ్చలను
పోగొట్టి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతే కాకుండా చర్మం
మీద వచ్చే మంటను కూడా
నివారిస్తుంది.
విధానం:
పాల పొడి, తేనే మరియు
నిమ్మరసం కలిపి పేస్టు తయారు
చేసి, ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల
తరువాత గోరువెచ్చని నీటితో మసాజ్ చేస్తూ కడగండి.