ఈ రసం తాగితే కిడ్నీ వ్యాధులు మాయావుతాయి..



మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంది. మన శరీరంలో ముఖ్యంగా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిత్యం పనిచేస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనలోని వ్యర్థాలను బయటకు పంపివేసి మన కిడ్నీలను ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

1. తాజా, శుభ్రమైన కొత్తిమీర ఆకులను కొన్నింటిని తీసుకోవాలి. వాటిని పెద్ద ముక్కలుగా తురుముకోవాలి.

2. ఒక పాత్రలో మంచి నీటిని తీసుకుని దాంట్లో కత్తిరించిన ఆకులను వేసి కొంచెంసేపు నానబెట్టాలి. కొద్దీ సేపటి తరువాత వాటిని అదే నీటితో స్టవ్ పై 10 నిమిషాల పాటు మరిగించాలి.

3. అనంతరం స్టవ్ నించి దింపిన పాత్రపై ఒక మూత పెట్టి లోపలి ద్రవాన్ని చల్లారనివ్వాలి.

4. ద్రవం చల్లారాక దాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి.

5. రోజుకి ఒక గ్లాస్ చొప్పున నెలకు రెండు సార్లు ఈ పానీయాన్ని సేవించాలి. దీన్ని తీసుకున్న తరువాత వచ్చే మూత్రం రంగు మారి ఉంటుంది. అంటే మీ శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతున్నాయన్నమాట. ఈ పానీయంతోపాటు రోజులో వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది.

6. మహిళలకు రుతు సమయంలో కలిగే నొప్పులను తొలగించడంలోకూడాఈ పానీయంగా బాగా పనిచేస్తుంది.

7. అయితే గర్భిణీలు దీన్ని తాగాలనుకుంటే ముందుగా వైద్యున్ని సంప్రదించాలి.

Share this

Related Posts

Previous
Next Post »